భారత హాకీ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకొని యావత్దేశాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తింది. జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పోరులో మన్ప్రీత్సేన అద్భుత పోరాట పటిమతో విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో అద్వితీయ విజయాన్ని సాధించిన భారత హాకీ జట్టుపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షాన్ని కురిపించారు.
భారత టీమ్కు అభినందనలు. అకుంఠిత దీక్ష, ప్రతిభాపాటవాలతో దేశం గర్వించేలా చేశారు. అద్భుతమైన మ్యాచ్ ఇది
1980 తర్వాత తొలిసారి భారత హాకీ టీమ్ పతకం సాధించడం ఆనందంగా ఉంది. చారిత్రక విజయమిది. టీమ్ సభ్యులందరికి అభినందనలు -వెంకటేష్
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత దేశం కల ఫలించింది. భారత బృందానికి శుభాకాంక్షలు. -సాయిధరమ్తేజ్