జడేజా అర్ధ సెంచరీ.. భారత్ 325/8

తొలి టెస్ట్లో ఘోరంగా విఫలమైన భారత్ రెండో టెస్ట్లో పుంజుకుంది. కెప్టెన్ అజింక్యా రహానే(112) అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 327/5తో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. అయితే లేని రన్కు ప్రయత్నించడంతో స్టాండిన్ కెప్టెన్ అజింక్యా రహానే రనౌట్గా వెనుదిరిగాడు.
ఇటు బౌలింగ్తో పాటు అటు బ్యాటింగ్లోను రాణిస్తున్న రవీంద్ర జడేజా(57) మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయడంలో దోహదపడ్డాడు. అయితే స్టార్క్ వేసిన బౌన్సర్స్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఇక ఉమేష్ యాదవ్(9) పరుగులు చేసి లియాన్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్(14)తో పాటు బుమ్రా(0) ఉన్నారు.
తాజావార్తలు
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
- ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!
- తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ
- నేతాజీ జయంతి ఇక పరాక్రమ్ దివస్
- రిపబ్లిక్ డే వేడుకలకు వారికి అనుమతి లేదు..
- ఆయిల్ పామ్ సాగుకు మరింత ప్రోత్సాహం : మంత్రి నిరంజన్రెడ్డి
- ఆస్ట్రేలియాలో క్వారెంటైన్.. టెన్షన్లో టెన్నిస్ ప్లేయర్లు
- 50 ఏళ్ల గవాస్కర్ రికార్డును బద్ధలు కొట్టిన శుభ్మన్ గిల్
- 17 ఏళ్ల బాలికపై 38 మంది లైంగిక దాడి
- సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం