మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి వినతి
సానుకూలంగా స్పందించిన మంత్రి
చేర్యాల, మార్చి 22 : పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాల పట్టణాభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైదరాబాద్లో సోమవారం మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పట్టణాభివృద్ధి కోసం తయారు చేసిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో మంత్రి కేటీఆర్కు అందజేయడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో వారు మాట్లాడుతూ చేర్యాల పట్టణాభివృద్ధికి కావాల్సిన నిధులను ప్రభుత్వం తప్పక మంజూరు చేస్తుందని, దీంతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో ప్రజలకు మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చేర్యాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. చేర్యాల పట్టణాభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి వినతిపత్రం అందించడంతో చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీశ్, యాట కనకమ్మ యాదగిరి, మంగోలు చంటి, జుబేదా ఎక్బాల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.