న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా సెకండ్ వేవ్తో భారత్ రక్తమోడుతున్నదని, సహాయం చేయాలని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరగడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారతదేశం నా ఇల్లు. ఇప్పుడు కొవిడ్ సంక్షోభంలో చిక్కుకొన్నది. రికార్డు స్థాయిలో రోజూ వేల మంది చనిపోతున్నారు. మనందరం సాయం చేయాలి. ట్విట్టర్లో నాకు 2.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరంతా తమకు తోచినంత సాయం చేస్తే అది పెద్ద మొత్తం అవుతుంది. విరాళం ఇచ్చేవారు గివ్ఇండియా ఎన్జీవోకు పంపించండి’ అని వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.