కన్నడలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి తెలుగులో ఇడియట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రక్షిత. తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. రక్షిత తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఉండడంతో ఆమెకు సినిమాలలో నటించే ఆఫర్ సులువుగా దక్కింది. తెలుగులో రవితేజ, మహేష్ బాబు, నాగార్జున వంటి బడా హీరోల సరసన నటించింది.
కెరీర్ సాఫీగా సాగుతుందని అనుకున్న సమయంలో రక్షిత కన్నడ డైరెక్టర్ ప్రేమ్ని వివాహం చేసుకుంది. ప్రేమ్ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రక్షిత .. జోగయ్య, డీకే అనే రెండు చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం రక్షిత కన్నడ షోస్కు జడ్జిగా వ్యవహరిస్తూ ఏక్ లవ్ యూ అనే సినిమా నిర్మిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తుందట. అయితే రక్షితకు సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఇందులో రక్షితను చూసి ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు. కాగా, కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య రావడంతో తాను లావెక్కినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రక్షిత