సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యాహోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’. ‘రైడర్స్ స్టోరీ’ ఉపశీర్షిక. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. జి.మహేష్ నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తయింది. ‘యు’ సర్టిఫికెట్ లభించింది. నిర్మాత మాట్లాడుతూ ‘రోడ్ జర్నీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. నాలుగు పాత్రల ప్రధానంగా సాగుతుంది. జీవితాన్వేషణలో నలుగురు బైక్ రైడర్స్ తెలుసుకున్న వాస్తవాలేమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మంచి సినిమా చేశామని సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. సరికొత్త కథ, కథనాలతో ఆద్యంతం థ్రిల్ను పంచుతుంది. ఇటీవల విడుదలచేసిన టీజర్కు చక్కటి స్పందన లభిస్తోంది’ అని అన్నారు. సుబ్బరాజు, సప్తగిరి, పృథ్వీ, సమీర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్.