బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ అఖ్తర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ తుఫాన్. భాగ్ మిల్కా భాగ్ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్ లో ఆ రేంజ్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో చిట్ చాట్ చేశాడు ఫర్హాన్అఖ్తర్. డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో భాగ్ మిల్కా భాగ్ సినిమా నుంచి మంచి అనుబంధం ఏర్పడింది. మరో స్పోర్ట్స్ డ్రామా తన దగ్గర ఉందని రాకేశ్ నాతో చెప్పినపుడు చాలా ఎక్జయిట్ అయ్యాను. బాక్సర్ అజీజ్ అలీ రోల్ గురించి తెలుసుకున్న వెంటనే సినిమా చేసేందుకు ఓకే చెప్పానన్నాడు ఫర్హాన్.
మీ తదుపరి చిత్రాన్ని ఎప్పుడు డైరెక్ట్ చేయబోతున్నారని ప్రశ్నించగా..హిందీ సినిమా డైరెక్ట్ చేయాలనుకున్నా. కానీ కోవిడ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. ఖచ్చితంగా నేను సినిమా తీస్తా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నానని చెప్పాడు అఖ్తర్. నాకు తెలుగు సినిమాలో నటించాలని ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఒకవేళ మంచి పాత్ర వస్తే తెలుగు సినిమా చేసేందుకు రెడీ. టాలీవుడ్ లో మంచి సినిమాలు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు ఫర్హాన్అఖ్తర్.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!