బెజ్జూర్, ఏప్రిల్ 21 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని అదనపు కలెక్టర్ రాజేశం అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. ఎంతమందికి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారని డాక్టర్ రుషిని అడిగి తెలుసుకున్నారు. టీకాలు వేసుకొని విశ్రాంతి తీసుకున్న వారిని పరిశీలించారు. ఉపాధిహామీ పనులకు వెళ్లే సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించేలా చూడాలని ఎంపీడీవో రాజేందర్ను ఆదేశించారు. సూచించారు. గ్రామంలో నిరంతరం శానిటైజేషన్ చేపట్టాలని సర్పంచ్ అన్సార్ హుస్సేన్కు సూచించారు. 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ టీకా వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని డీఆర్డిపోలో ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు ఒక్కొక్కరికీ 25 కేజీల సన్నబియ్యం అందజేశారు. పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూ చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జమీర్, కార్యదర్శులు చంద్ర శేఖర్, సందీప్, ఉపాధిహామీ, రెవెన్యూ, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
ఆసిఫాబాద్టౌన్,ఏప్రిల్21 : జిల్లాకేంద్రంలో అదనపు కలెక్టర్ రాజేశం ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్తో కలిసి ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈవో పాణిని, ప్రభుత్వ పరీక్షల కన్వీనర్ ఉదయ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్టౌన్ , ఏప్రిల్ 21 : పట్టణంలోని ఈద్గా కాలనీ పాఠశాలలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల చొపుపన బియ్యాన్ని అందజేశారు. కార్యక్ర మంలో తహసీల్దార్ ప్రమోద్కుమార్, ఎంఈవో భిక్షపతి, మాజీ కౌన్సిలర్ నియాజొద్దీన్, రేషన్ డీలర్లు లడ్డుబాపు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.