బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
కరోనా కష్టకాలంలోనూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న విప్
రామకృష్ణాపూర్, మే 23 :ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తమ ఔదార్యాన్ని చాటుతున్నాడు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసరాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాడు. తన సొంత డబ్బులతో 2 వేల మందికి ఒక్కొక్కటి రూ.1000 విలువ గల 13 రకాలు గల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నాడు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో 400 నిరుపేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యా సాగర్రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాల్టీలో టీఆర్ఎస్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు 40 0 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల సరుకులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ చెన్నూరు ఎ మ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సొంతంగా 2 వేల మందికి సరిపడా రూ. 1000 విలువైన 13 రకాల నిత్యావసర సరుకులను సమకూర్చారన్నారు. లాక్డౌన్ అమలుతో పనుల్లేకుండా ఇ బ్బందులు పడుతున్న నిరుపేదలను అందజేశామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యా సాగర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ సమన్వయ కర్త అబ్దుల్ అజీజ్, కో-ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు యాకూబ్అలీ, కంభగోని సుదర్శన్, రామిడి కుమార్, నర్సింగరావు, నీలం శ్రీనివాస్, ఎర్రబెల్లి రాజేశ్, గడ్డం రా జు, కొక్కుల సతీశ్, ఎల్లబెల్లి మూర్తి, అలుగుల సత్తయ్య, ప్రేమ్సాగర్, బింగి శివకిరణ్, కౌన్సిలర్లు పుల్లూరి సుధాకర్, రెవేల్లి ఒదేలు, గడ్డం సంపత్కుమార్, అనిల్రావు, పార్వతీ విజయ, పొలం సత్యనారాయణ, పారిపెల్లి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.