గత కొన్ని రోజులుగా ప్రియమణి పెళ్లి అక్రమం అంటూ ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరు బిజినెస్ మెన్ ముస్తఫాను మూడేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకుంది ప్రియమణి. అప్పటికే ఆయనకు ఒకసారి పెళ్లయింది. అతడి మొదటి భార్య పేరు అయేషా. 2013 నుంచి ఆయన తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. కోర్టులో విడాకులు తీసుకున్నాను అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మొదటి భార్య అయేషా మాత్రం తనతో ఇప్పటికీ విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది. కోర్టులో కూడా ఈమె ఇదే కేసు ఫైల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రియమణి, ముస్తఫా పెళ్లి అక్రమం అని..తనతో ఇంకా చట్టపరమైన సంబంధం ఉంది అంటూ ఆమె వాదిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ప్రతి నెల తన ఇద్దరు పిల్లల కోసం ముస్తఫా డబ్బులు పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రియమణితో పెళ్లి అక్రమ పద్ధతిలో జరిగింది అంటూ అయేషా సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఇప్పుడు ప్రియమణి స్పందించింది. తమది చట్టపరమైన సంబంధమని.. ముస్తఫా లాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటోంది ప్రియమణి.
ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నాడని.. ఏమాత్రం తీరిక దొరికినా కూడా వెంటనే వీడియో కాల్స్ లో మాట్లాడుకుంటామని తెలిపింది ప్రియమణి. కుదరకపోతే కనీసం హాయ్ బాయ్ అంటూ మాట్లాడుకుంటామంటుంది. తమ బంధం గురించి అనుమానాలు వ్యక్తం చేసే వాళ్లకు ఒకటే విషయం చెబుతున్నాను అంటోంది ప్రియమణి. తాము చాలా అన్యోన్యంగా ఉన్నామని.. ఎలాంటి గొడవలు లేవు.. ప్రేమగా ఉన్నాం ఎలాంటి విషయమైనా కలిసి పంచుకుంటాం అంటుంది ఈమె. ప్రియమణి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?