టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), రకుల్ ప్రీత్సింగ్ (Rakul Preet Singh) కాంబోలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం (Kondapolam). అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కాబోతుంది. కొండపొలం ఆడియో లాంఛ్ కార్యక్రమం శనివారం కర్నూలు లో జరిగింది. కొండపొలం సినిమా కొంత మంది వ్యక్తుల వల్ల తెరరూపం దాల్చిందన్నారు డైరెక్టర్ క్రిష్ (Krish). ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ..నేను మొట్టమొదట పవన్కల్యాణ్ (Pawan Kalyan)కు కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనతో హరిహర వీరమల్లు సినిమాను రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నా.
కరోనా మహమ్మారి సమయంలో నేను కొండపొలం సినిమా చేస్తున్నానని పవన్ కల్యాణ్ తో చెప్పాను. ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూనే..ఈ చిత్రం నాకు, నా టీంకు ఎంత ముఖ్యమో చెప్పారు. ఒకవేళ పవన్ కల్యాణ్ లేదా ఏఎం రత్నం ఒప్పుకోకపోయింటే ఈ రోజు కొండపొలం సినిమా మీ ముందుండేది కాదంటూ చెప్పుకొచ్చాడు క్రిష్. డైరెక్టర్లు సుకుమార్, ఇంద్రగంటి మోహనకృష్ణ తనకు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం పుస్తకం ఇవ్వడం వల్లే ఈ సినిమా తీయాలనే స్ఫూర్తి కలిగిందని చెప్పాడు.
తన సంగీతంతో కొండపొలం చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిన ఎంఎం కీరవాణికి డైరెక్టర్ క్రిష్ ధన్యవాదాలు తెలియజేశాడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Manoj Bajpayee: మరో విషాదం.. మనోజ్ బాజ్పేయ్ తండ్రి మృతి
Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీం..!
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి