హైదరాబాద్: సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని కొవిడ్ దవాఖానలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈ-మెయిల్ ద్వారా ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జనరల్ ఫిజిషియన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, నర్సింగ్ ఇన్చార్జి వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తుంది.
మొత్తం పోస్టులు: 35
ఇందులో జనరల్ ఫిజిషియన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, నర్సింగ్ ఇన్చార్జి, నర్సింగ్ స్టాఫ్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, జీఎన్ఎం లేదా బీఎస్సీ (నర్సింగ్), ఎంబీబీఎస్, జనరల్ మెడిసిన్లో ఎండీ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా (ceo.seb2009@gmail.com)
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
వెబ్సైట్: https://secunderabad.cantt.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి