హైదరాబాద్ : దేశంలో కరోనా రోజురోజుకి పెరుగుతోంది. గతేడాది పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉందని నమోదువుతున్న కేసులే చెబుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నమోదువుతన్నాయి. దీంతో రాత్రిళ్లు కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి.
మళ్లీ లాక్ డౌన్ తప్పదన్న భయంతో ఊర్లనుంచి నగరాలకు తిరిగి వచ్చిన జనం సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో రైల్వే, బస్టాండ్ లు రద్దీగా మారాయి. ఢిల్లీలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు రాత్రిళ్లు కర్ఫ్యూని అమలుచేస్తుండటంతో స్వ గ్రామాలకు జనం పరుగులు పెడుతున్నారు.
దీంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సీట్లు దొరక్కపోయినా జనం వేలాడి మరీ రైళ్లల్లో ప్రయాణాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి