వర్ధన్నపేట, మే 15 : కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం, ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని కట్య్రా ల శివారు ఉప్పరపల్లి క్రాస్రోడ్డు వద్ద ఉ న్న ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో సంపత్రావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు. ధాన్యాన్ని తూకం వేయడం, మి ల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోందని కలెక్టర్కు వివరించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడిసి ఇబ్బందులకు గురవుతున్నామని, కాంట్రాక్టర్ వాహనాలను ఏర్పాటు చేయించకపోవడంతో పాటు మిల్లర్ల నిర్లక్ష్యం మూలంగా కేంద్రాల్లో ధాన్యం పోసి రోజుల తరబడి పడిగాపులుకాయాల్సి వస్తోందని వివరించారు. త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
కాంటాలు త్వరగా కావాలి..
పర్వతగిరి : కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యం త్వరితగతిన కాంటాలు అయ్యేలా చూడాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. మండలంలోని గోపనపెల్లి, కొంకపాక గ్రామాల్లోని ధాన్యం కొనుగో లు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కాంటాలు అయిన వెంటనే బస్తాలను మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, డీసీవో సంజీవరెడ్డి పాల్గొన్నారు.
నిర్వాహకులపై ఆగ్రహం..
సంగెం : ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులపై కలెక్టర్ హరి త ఆగ్రహం వ్యక్త చేశారు. మండలంలోని కాపులకనపర్తి, గవిచర్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. గవిచర్ల కొనుగోలు కేంద్రంలో వారం రోజులుగా సంచులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్కు విన్నవించారు. దీంతో కలెక్టర్ నిర్వాహకులు, డీసీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సం బంధిత కార్యాలయానికి ఫోన్ చేసి 10వేల సంచులు సత్వరమే పంపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభు త్వం సూచించిన విధంగా తూకం వేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్రావు, డీసీవో సంజీవరెడ్డి, సర్పంచ్ దొనికెల రమ, ఎంపీటీసీ గూడ సంపత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.