బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 5 జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తి చేసుకోగా, షో రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. అయితే రీసెంట్గా నవరాత్రి ఉత్సవాలు పేరుతో బిగ్బాస్ స్పెషల్ ఎపిసోడ్ను నిర్వహించారు. ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు పలువురు గెస్ట్లని ఆహ్వానించింది బిగ్ బాస్ యాజమాన్యం.
స్సెషల్ ఎపిసోడ్లో వినోదం పంచేందుకు హైపర్ ఆది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నటులు అఖిల్, పూజ హెగ్డేతో పాటు నటి మీనాక్షి, హెబ్బా పటెల్, నాట్యం నటి వచ్చి తమ పర్ఫామెన్స్తో అలరించారు. అయితే ఆది పోలీసు ఆఫీసర్గా వచ్చి బిగ్బాస్ హౌజ్మెట్స్పై ఇన్వెస్టిగేషన్ చేశాను అంటూ గుక్క తిప్పుకోనివ్వకుండా మాట్లాడాడు. ఉన్నంత సేపు ఫుల్గా వినోదం పంచాడు. ఈ షోలో 25 నిమిషాల పాటు కనిపించిన ఆది 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఆ మాత్రం ఇవ్వడంలోతప్పులేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.