సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతుంది. త్రివిక్రమ్ సినిమాలంటే ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్లా ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా కోసం పలు భారీ సెట్టింగ్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా రూపుదిద్దుకుంటుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే, జాన్వీ కపూర్ని తీసుకుంటారని ప్రచారం నడుస్తుంది. కీలక పాత్రలకు సుమంత్, శిల్పా శెట్టిల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.