యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్పై ఉన్నాయి. నాగ్ అశ్విన్ చిత్రం నవంబర్ నుండి ప్రారంభం కానుంది. ఇక ఇటీవల సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నట్టు రీసెంట్గా ప్రకటించిన ప్రభాస్ వచ్చే ఏడాది నుండి సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. టీ సిరీస్, సందీప్ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.
ప్రభాస్ తో ప్రకటించిన స్పిరిట్ సినిమా..మహేష్ బాబుకు చెప్పిన కథతోనే తీయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.మహేష్ కు చెప్పిన స్టోరీలోనే కొన్ని మార్పులు చేసి ప్రభాస్ స్టైల్ లో వినిపించాడట. ఇందులో ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్గా చూపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలివుడ్ ట్రేడ్ టాక్.
ఇండియాతో పాటు జపాన్, చైనా, కొరియా వంటి దేశాల్లో కూడా ప్రభాస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకు మార్కెట్ ఉంది. అందుకే ప్రభాస్ ఆ స్థాయిలో సినిమాకు చార్జ్ చేస్తున్నారు. ఇక స్పిరిట్ మొత్తం ఐదు ఇండియన్ బాషలతో పాటు, మూడు విదేశీ బాషలలో విడుదల కానుంది.