టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.కీలక సన్నివేశాల కోసం హైదరాబాద్ ఔటర్ ప్రాంతంలో రూ.6.5 కోట్లతో వేసిన స్పెషల్ సెట్ వేశారు మేకర్స్ . ఆర్ట్ డైరెక్ట్ అవినాష్ కొల్లా సారథ్యంలో 1000 మంది కార్మికులు చాలా నెలలపాటు కష్టపడి ఈ సెట్ వేశారు. కోవిడ్ టైంలో ఈ సెట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ను నిలిపేసింది నాని, రాహుల్ టీం.
లాక్ డౌన్ పూర్తయి, కేసులు తగ్గిన తర్వాత షూటింగ్ ను మొదలు పెట్టాలని ఎదురుచూస్తున్నారు మేకర్స్. అయితే ఇటీవలే హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు సెట్ దెబ్బతిన్నదట. ఇప్పటికే కోవిడ్ తో షూటింగ్ నిలిపేసిన మేకర్స్ కు ఇలా సెట్ దెబ్బతినడం పెద్ద మొత్తంలో నష్టం ఏర్పడినట్టు టాక్ నడుస్తోంది. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా వస్తోంది శ్యామ్ సింగరాయ్.
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్