కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు..అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే 4000 కోట్లు నష్టపోయిందని ఒక అంచనా. తమిళ ఇండస్ట్రీకి సైతం దాదాపు 1000 కోట్లు నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే దాదాపు 1200 కోట్ల వరకు నష్టం వచ్చిందని సీనియర్ నిర్మాతల నుంచి వస్తున్న సమాచారం. మరీ ముఖ్యంగా కేవలం సమ్మర్ సీజన్ లో దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. 2020 వేసవి సీజన్ అంతా థియేటర్లు మూతపడటంతో లాక్ డౌన్ కారణంగా నష్టపోయింది. కనీసం ఈ ఏడాది పరిస్థితి మారుతుంది అనుకుంటే అది కూడా జరగలేదు.
చాలా సినిమాలు ముందు నుంచి విడుదల తేది కన్ఫర్మ్ చేసుకున్న కూడా చివరి నిమిషంలో మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సమ్మర్ సీజన్ పీక్స్ లో ఉంటుంది. ఈ ఒక్క సీజన్లోనే తెలుగు ఇండస్ట్రీకి దాదాపు 1000 కోట్ల టర్నోవర్ వస్తుందని ఒక అంచనా. ఈ సారి పరిస్థితులన్నీ బాగా ఉండుంటే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాట పర్వం, ఆచార్య, ఖిలాడి, అఖండ, రాధే శ్యామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు.
సెకండ్ వేవ్ లో కేసులు మరీ దారుణంగా పెరిగిపోతుండటంతో సినిమాలు విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. అలాగని థియేటర్లలో తీసుకురావాల్సిన సినిమాలను డిజిటల్లో విడుదల చేయడం సరైన నిర్ణయం కాదు అంటున్నారు. ఒకవైపు థియేటర్లు ఓపెన్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేస్తే థియేటర్ కు వచ్చే సాహసం ప్రేక్షకులు చేయడం లేదు.
కరోనాకు ముందు విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు కూడా చివర్లో నష్టాలు తప్పలేదు. ఆరంభం అదిరిపోయినా వారం రోజుల తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది ఈ సినిమా. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 1200 కోట్ల వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుందని తెలుస్తోంది. మరి ఈ వైరస్ ఇంకా ఎంత కాలం ఇండస్ట్రీని పట్టి పీడిస్తుందో చూడాలి. అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప ఇంకేమి చేయలేని పరిస్థితి వచ్చింది.
Video Player is loading.https://imasdk.googleapis.com/js/core/bridge3.462.0_en.html#goog_1601936580
Video Player is loading.PauseUnmuteLoaded: 0.00%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్