ఇంటి సభ్యులతో సరదా గేమ్స్ ఆడించిన నాగ్

బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ఫుల్గా పది వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హౌజ్లో ఎనినిది మంది సభ్యులు ఉండగా, కుమార్ సాయి రీఎంట్రీ ఇస్తాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం ఎపిసోడ్ చాలా సరదాగా ఎమోషనల్గా సాగింది. ఇంటి సభ్యులతో సరదా ఆటలాడించిన నాగార్జున ఆ తర్వాత మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. దీంతో ఇంటి సభ్యులు ఆ బాధని తట్టుకోలేక తెగ ఏడ్చేశారు.
ఎపిసోడ్ 71 మొదట్లో ఇంటి సభ్యులతో కలిసి గద్ద-కుందేలు ఆట ఆడించారు. ఇందులో ఒకరు గద్దగా మారి కుందేలిని పట్టుకోవాలి. సరదాగా సాగిన ఈ గేమ్లో సోహైల్ విన్నర్గా నిలవగా, అరియానా రన్నరప్గా నిలిచింది. ఆతర్వాత వీరిద్దరిని రెండు టీమ్లుగా విడిపోయి సభ్యులని ఎంపిక చేసుకోవాలని చెప్పడంతో సోహైల్ టీంలో అవినాష్, అఖిల్, హారిక ఉన్నారు. అరియనా టీంలో మెహబూబ్, లాస్య, అభిజిత్ ఉన్నారు. మోనాల్ సంచాలకురాలిగా వ్యవహరించింది.
సినిమా పేర్లని బొమ్మల రూపంలో డ్రా చేస్తే దాని పేరు గెస్ చేసే గేమ్లో భాగంగా సోహైల్ టీం ఎక్కువ పాయింట్స్ సాధించింది. గేమ్ మధ్యలో మోనాల్, అరియానా, హారికలని సేవ్ చేశారు నాగార్జున. ఇద్దరు స్నేహితులు చివరకి మిగలగా వారిద్దరిలో ఎవరు పోతారనే టెన్షన్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.చివరకు మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించడంతో హౌజ్ అంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి.. నెటిజన్లను అడిగిన రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్