చూస్తుండగానే బిగ్ బాస్ కార్యక్రమం రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ కావడంతో హౌజ్లో 17మంది మాత్రమే ఉన్నారు.ఆదివారం ఎపిసోడ్లో నాగ్ గేమ్ ఆడిస్తూనే ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు రివీల్ చేశాడు.
సండే రోజు సరదా గేమ్ ఆడించారు నాగ్. గార్డెన్ ఏరియాలో డెస్టినీ గేమ్ అంటూ ఏర్పాటు చేయగా, ఇందులో అబ్బాయిలని, అమ్మాయిలని రెండు జట్లుగా విడదీసాడు. డెస్టినీ ఆధారంగా వచ్చిన పేర్లతో డ్యాన్స్లు చేయించాడు. ముందుగా షణ్ముఖ్- ఉమాదేవి కలిసి డ్యాన్స్ చేశారు.
కంటెస్టెంట్లు అందరూ వీరి పర్ఫామెన్స్ను తెగ ఎంజాయ్ చేశారు. నాగ్ కూడా ఇంప్రెస్ కాగా, షన్నుకు ఏడు, ఉమా ఎక్స్ప్రెషన్స్కి 8 మార్కులు ఇచ్చేశాడు.ఆ తర్వాత లహరి- జశ్వంత్ డ్యాన్స్ చేశారు.ఈ ఇద్దరూ స్వింగ్ జరా పాటకు డ్యాన్స్ వేశారు. జెస్సీ అదరగొట్టేశాడు. కాజల్కు జోడిగా లోబో వచ్చాడు. భీమవరం బుల్లోడా అనే పాటకు ఈ ఇద్దరూ డ్యాన్సు వేశారు.
శ్వేతకు జోడిగా సన్నీ వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి అమ్మడు కుమ్ముడు అనే పాటకు స్టెప్పులు వేశారు. ప్రియకు జోడిగా రవి రాగా, లక్ష్మీ బావా అనే పాటకు ఈ ఇద్దరూ అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. హమీదకు శ్రీరామచంద్ర జోడిగా వచ్చాడు. లంచుకొస్తావా? అనే పాటకు ఈ ఇద్దరూ డ్యాన్సులు వేశారు. ప్రియాంకకు మానస్ జోడిగా వచ్చాడు. నచ్చావే నైజాంపోరి అంటూ ఇద్దరూ రెచ్చిపోయారు. ఆనీ మాస్టర్కు విశ్వ జోడిగా వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి జ్వాలా రెడ్డి పాటకు దుమ్ములేపేశారు.
నటరాజ్ మాస్టర్-సిరి కలిసి డ్యాన్స్ చేశారు. గరంగరం సిలక అంటూ నటరాజ్ మాస్టర్ తన టాలెంట్ను అంతా చూపించేశాడు. నటరాజ్ మాస్టర్కు పది ఇవ్వాలి కానీ కొరియోగ్రఫర్ కాబట్టి 9 ఇస్తాను. సిరికి 8 అంటూ నాగ్ చెప్పేశాడు. మొత్తానికి అమ్మాయిలని విజేతలుగా ప్రకటించాడు నాగ్.