కాజీపేట, ఏప్రిల్ 23 : గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలో 62వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ను అని విధాలా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి సుంచు కృష్ణ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలి కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సహకారంతో ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఆయన వెంట ఆర్టీఏ సభ్యుడు కాటాపురం రాజు, బస్వ యాదగిరి, కాంట్రాక్టర్ కుమార్, పాలడుగుల శివకుమార్, రామస్వామి, సుంచు అశోక్, ఫర్హాన్, రఘురాం ఉన్నారు.
అభివృద్ధిని చూసి గెలిపించండి..
భీమారం, ఏప్రిల్ 23 : గ్రేటర్ పరిధిలోని వంగపహాడ్, పెగడపల్లి, గుండ్లసింగారం గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ 2వ డివిజన్ అభ్యర్థి బానోత్ కల్పనాసింగ్లాల్ ఓటర్లను కోరారు. శుక్రవారం పెగడపల్లి, వంగపహాడ్ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్లో ప్రతి వాడకు సీసీ రోడ్డు, డ్రైనేజీ, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, శ్మశానవాటికలను నిర్మించామన్నారు. ఎన్నికల ఇన్చార్జి కరిమిళ్ల దుర్గారావు, పెగడపల్లి మాజీ సర్పంచ్ నరెడ్ల శ్రీధర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఖలీల్, ఇనుముల నాగరాజు, మహేందర్, తాళ్లపల్లి రాజాగౌడ్, బాల్నె మల్లేశం, సాగర్, మంద సాంబరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
56వ డివిజన్లో..
నయీంనగర్ : గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్లోని జవహర్కాలనీ, పూరుగుట్ట, సప్తగిరి కాలనీ, గణేశ్నగర్, కనకదుర్గ కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సిరంగి సునీల్కుమార్ ప్రచారం నిర్వహించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో చింత రమేశ్, పెద్ద రాజు, సతీశ్, చందర్, కుమార్, కృష్ణ, రాము, ప్రభాకర్, దూలం రాజు, మహేందర్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..
హన్మకొండ సిటీ, ఏప్రిల్ 23 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫును పొటీచేస్తున్న అభ్యర్థులను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ పెన్షనర్స్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లిఖార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంతో పాటు ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.