‘హనీట్రాప్ వలలో పడి ఎంతోమంది తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఎలాంటి ఆకర్షణలకు లోనుకావద్దనే సందేశంతో నేటి యువతను చైతన్యవంతం చేసేలా ఈ సినిమాను రూపొందించాం’ అని అన్నారు వామనరావు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘హనీట్రాప్’. రిషి, శిల్పానాయక్, తేజు అనుపోజు ప్రధాన పాత్రల్లో నటించారు. సునీల్కుమార్రెడ్డి దర్శకుడు. ఈ నెల 17న విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్లో వామనరావు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఎనిమిదేళ్ల క్రితం పాకిస్థాన్ అమ్మాయి ఇండియన్ నేవీ ఆఫీసర్ను ట్రాప్ చేసి దేశ రహస్య సమాచారాన్ని దోచుకున్నది. ఆ సంఘటనతో పాటు హనీట్రాప్ గురించి పత్రికల్లో వచ్చిన పలు కథనాల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమా చేశాం. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే కథ, స్క్రీన్ప్లేతో పాటు కీలక పాత్రలో నటించా. రాజకీయనాయకులు, ఉన్నత విద్యావంతులు సైతం హనీట్రాప్ వలలో పడి జీవితాల్ని కోల్పోతున్నారు. ఈ వ్యామోహం వల్ల ఎదురయ్యే అనర్థాల్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు సునీల్కుమార్రెడ్డి అర్థవంతంగా సినిమాను తెరకెక్కించారు. సమకాలీన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం యువతరాన్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు.