యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే.ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండగా, ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. సలార్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాలో రూపొందుతున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది.
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకముందెన్నడు లేని హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మ్యాట్రిక్స్, బ్యాట్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో ”సలార్” చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఇందులోని ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ని అందించనున్నారని అంటున్నారు.
చిత్రంలో ప్రభాస్ ను గ్యాంగ్ స్టర్ తరహా లుక్ లో చూపించనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ . అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘సలార్’ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.