సంగారెడ్డి, మార్చి 25 : కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకుని ప్రజల అపోహలను తొలగించాలని, సకాలంలో వ్యాక్సిన్ చేయించుకునేలా అవగాహన కల్పించాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పరిషత్లోని జడ్పీ చాంబర్లో చైర్పర్సన్ అధ్యక్షతనలో స్థా యీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఉద యం 10 గంటలకు 2వ స్థాయీ సంఘం (గ్రామీణాభివృద్ధి), మధ్యాహ్నం 12 గంటలకు 4వ స్థాయీ సంఘం (విద్య, వైద్యం), 2.30 గంటలకు 7వ స్థాయీ సంఘం (పనులు), సాయంత్రం 4 గంటలకు 1వ స్థాయీ సం ఘం (ఆర్థిక ప్రణాళిక)పై సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రెండోసారి కరోనా కేసులు పెరుగుతున్నందున వైద్యాధికారులు కొవిడ్ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించాలన్నారు. అదేవిధంగా ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పా టించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీలు రాఘవరెడ్డి, అరుణరెడ్డి, కొండల్రెడ్డి, సుధాకర్రెడ్డి, మల్లికార్జున్పాటిల్, సునీత, ఆంజనేయులు, మీనాక్షి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, పాల్గొన్నారు.