ప్రస్తుతం టాలీవుడ్లో పలు మల్టీ స్టారర్స్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహా సముద్రం కూడా ఒకటి. శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమా రెగ్యులర్ మాస్ ఎంటర్టైన్ చిత్రాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కంటెంట్తో తెరకెక్కుతోంది. సముద్రం బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవల మహా సముద్రం చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఆ మధ్య సినిమా నుండి మోషన్ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఇక తాజాగా హే రంభ రంభ అనే సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ పాటని భాస్కర భట్ల రాయగా, చైతన్ భరద్వాజ్ ఆలపించారు. ఈ పాట మాస్ ప్రియులకు మాంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ సినిమాతో ఎనిమిదేళ్ల తర్వాత తెలుగు తెరపై అడుగుపెట్టబోతున్నాడు సిద్ధార్థ్.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు డిఫరెంట్ యాంగిల్లో కనిపించబోతున్నారని టాక్. ఆగస్టు 19న చిత్రం విడుదల కావలసి ఉండగా, కరోనా వలన వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.