గత 9 రోజులుగా కర్నాటకలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. సమస్యలను పరిష్కరించందే డిపోల్లోనుంచి బస్సులను తీయమని కార్మికులు తెగేసి చెప్పారు. దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. అయినా సరే సమ్మె విరమించే ప్రసక్తే లేదని కర్నాటక ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. ఇటు కార్మికులు అటు ప్రభుత్వం దిగిరాకపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
ఇలాంటి సమయంలో ఆర్టీసీ సమ్మెకు జై కొట్టారు కన్నడ స్టార్ హీరో యష్. బస్సు డ్రైవర్ కొడుకుగా కార్మికుల కష్టాలేంటో తనకు తెలుసునని అందుకే వారికి మద్దతుగా నిలుస్తున్నానని చెప్పారు. అంతేకాదు రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవదికి లేఖరాశారు. స్వయంగా కలుసుకొని కార్మికుల డిమాండ్లను అంగీకరించాల్సిందిగా కోరారు.