హైదరాబాద్ : తమిళ ఇండస్ట్రీలో ఆర్య, విశాల్ ఇరువురు మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి బాల దర్శకత్వంలో వచ్చిన వాడు వీడు సినిమాలో నటించారు. ఆ మధ్య ఆర్య హీరోగా వచ్చిన ఐశ్వర్యాభిమస్తు సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు విశాల్. తాజాగా ఇప్పుడు ఎనిమీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ను చిత్ర నిర్వాహకులు తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఒకేసారి విడుదల చేశారు. టీజర్ విడుదలైన కేవలం నాలుగు గంటల్లోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి.
ఒక నిమిషం నలభై సెకండ్ల నిడివిగల ఈ టీజర్ ఆధ్యంతం యాక్షన్ భరింతంగా కొనసాగింది. టీజర్ చివరలో ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే అని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్లో ఉంది.
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గద్దల కొండ గణేష్ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్ కీలక పాత్రలో నటించారు. మూవీ సెప్టెంబర్లో విడుదల కానుంది.