కథానాయకుడు రామ్, దర్శకుడు లింగుస్వామి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెల 12నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘హీరో రామ్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో రానున్న పక్కా ఊర మాస్ ఎంటర్టైనర్ ఇది. రామ్ పాత్ర అందర్నీ సర్ప్రైజ్ చేసే విధంగా వుంటుంది. రామ్లోని ఎనర్జీ ఈ చిత్రానికి మొదటిబలం. దేవిశ్రీప్రసాద్ సంగీతం, సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతాయి. ‘ఉప్పెన’లో తన నటనతో అందరి హృదయాలు దోచుకున్న కృతిశెట్టి ఈ చిత్రంలో నాయికగా నటిస్తుంది. భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతికత పరిజ్ణానంతో రూపొందనున్న ఈ చిత్రం అందర్నీ తప్పకుండా అలరిస్తుంది’ అన్నారు.