బెంగళూరు: ముఖ్యమంత్రి అన్నాక అన్ని శాఖల్లో జరుగుతున్న అభివృద్ధిపై, అవినీతిపై జోక్యం చేసుకోవడం, మాట్లాడటం జరుగుతుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ మంత్రి మాత్రం ఏకంగా ముఖ్యమంత్రిపైనే గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి తీరు 1977 వ్యాపార లావాదేవీ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తన మంత్రిమండలిలో ఒకరైన కేఎస్ ఈశ్వరప్ప కారణంగా తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. తన శాఖలో తలదూరుస్తున్నారంటూ ముఖ్యమంత్రి యెడియూరప్పపైనే మంత్రి ఈశ్వరప్ప ఆ రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయడం బీజేపీలో, బయటి పార్టీల్లో చర్చనీయాంశంగా తయారైంది.
ముఖ్యమంత్రి యెడియూరప్ప తన శాఖలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఈశ్వరప్ప ఆరోపిస్తున్నారు. ఈశ్వరప్ప ప్రస్తుతం కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. యెడియూరప్ప తీరుపై గవర్నర్ వాజుభాయ్ వాలాతోపాటు బీజేపీ అధిష్ఠానానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి తీరు పూర్తిగా ‘1977 వ్యాపార లావాదేవీ’ అనే నిబంధనకు విరుద్ధంగా ఉన్నదని, ఆ నిబంధనలను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఈశ్వరప్ప తన లేఖలో ఆరోపించారు.
ఈ లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కూడా పంపించారు. తన అనుమతి తీసుకోకుండా తన శాఖలో రూ.774 కోట్ల కేటాయింపులు జరిపారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించారు.
అటు మంత్రిమండలిలో, ఇటు పార్టీలో యెడియూరప్పపై ఉన్న కోపాన్ని ఈ ఫిర్యాదుతో మరోసారి ఎత్తిచూపినట్లయింది. ఈశ్వరప్ప ఒకప్పుడు ముఖ్యమంత్రి యెడియూరప్పకు దగ్గరి అనుచరుడుగా ఉండటం విశేషం.
వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి సంస్కరణలు తేవాలి: వెంకయ్యనాయుడు
ఈ గడ్డపై చిప్ తయారు చేస్తే 7 వేల కోట్ల ప్రోత్సాహం : కేంద్ర ప్రభుత్వం ఆఫర్
డబ్ల్యూహెచ్ఓకు మొత్తం కొవిడ్ డాటా ఇచ్చాం : చైనా శాస్త్రవేత్త స్పష్టీకరణ
ఫ్రస్టేషన్లో టార్చిలైట్ విసిరివేసిన కమల్ హాసన్
ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు : చివరి ముగ్గురు నిందితులు విడుదల
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండేవారికి కుచించుకుపోనున్న గుండె.. వ్యోమగాములపై పరిశోధన
చిన్నారుల్లో త్వరలో కరోనా వైరస్ కొత్త రూపం.. వ్యాక్సిన్ ఇప్పించడం తప్పనిసరి
భారతదేశానికి వచ్చిన దలైలామా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..