దుబాయ్: వన్డేల్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధిపత్యానికి చుక్కెదురైంది. తనదైన ఫామ్తో 1258 రోజుల పాటు వన్డేల్లో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగిన కోహ్లీకి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చెక్ పెట్టాడు. నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఆజమ్ 865 పాయింట్లతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్లో 94 పరుగులతో రాణించిన ఆజమ్ 13రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. కోహ్లీ(857), రోహిత్శర్మ(825) వరుసగా రెండు, మూడు ర్యాంక్ల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే జహీర్ అబ్బాస్, మియాందా ద్, యూసుఫ్ తర్వాత వన్డేల్లో టాప్లో నిలిచిన నాలుగో పాకిస్థాన్ క్రికెటర్గా ఆజమ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.