By Maduri Mattaiah
బాహుబలి (Bahubali) చిత్రంతో తెలుగు సినిమా మార్కెట్ స్థాయి, వసూళ్లు పెరగటంతో కథానాయకులు, నాయికలు, దర్శకుల పారితోషికాలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు సినిమాకు ఇతర భాషల్లో కూడా డిమాండ్ రావడంతో నిర్మాతలు కూడా స్టార్ హీరోలు కోరినంత పారితోషికాన్ని సమర్పిస్తున్నారు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ (Prabhas) సినిమాకు దాదాపు 75 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని తెలిసింది. ఇక ఆ తరువాత తెలుగులో వకీల్సాబ్ చిత్రానికి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు పవన్కల్యాణ్.
తాజాగా ఇదే వరుసలో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రం కోసం మహేష్బాబు (Maheshbabu) రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్బాబు తన సొంత సంస్థ ఎమ్బీ మూవీస్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటుంది. తన పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమా లాభాల్లో కూడా మహేష్ వాటా తీసుకోవడం కొసమెరుపు.
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!