రూ.2 వేలకే సీటీ స్కాన్ సేవలు
కరోనాపై సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
వరంగల్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. కరోనా నియంత్రణ, ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో వైద్యసేవలపై అధికారులు, ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులతో మంత్రి ఆదివారం సమీక్షించారు. సీటీ స్కాన్ సేవలను రూ.2 వేలకు అందించేలా ప్రైవేటు సంస్థలు అంగీకరించినట్టు చెప్పారు. ఎంజీఎంలో మెరుగైన వైద్యం అందుతున్నదని పేర్కొన్నా రు. సమీక్షలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ సుధారాణి పాల్గొన్నారు.