వీవీ వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన విశ్వా ఆర్.రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్.రాచయ్య నిర్మిస్తున్న చిత్రం ‘గీత’. మ్యూట్ విట్నెస్ ఉపశీర్షిక. హెబ్బా పటేల్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కథానాయకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. అనాథల కోసం పోరాడే మూగ యువతిగా హెబ్బా పటేల్ ఓ ఛాలెంజింగ్ రోల్ను పోషిస్తున్నారని దర్శకుడు తెలిపారు. రామ్కార్తిక్, సప్తగిరి, రాజీవ్కనకాల, పృథ్వీ, తనికెళ్లభరణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్.