దుగ్గొండి, మే 30 : కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను గ్రామాల్లో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను రోడ్లపైకి తీసుకొస్తున్న వాహనదారులకు కౌన్సెలింగ్ ఇస్తూ జరిమానా విధిస్తున్నారు. ఆదివారం స్థానిక ఎస్సై రవికిరణ్ పోలీసు సిబ్బందితో మండలంలో లాక్డౌన్ను పరిశీలించారు. గ్రామాల్లో పర్యటిస్తూ పెట్రోలింగ్ను ముమ్మరం చేశారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తూ అనవసరంగా బయటకు వస్తున్న వారిపై కఠినంగా వ్యహరిస్తున్నారు. నిబంధనలు పాటించని ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేశారు. మరికొన్ని వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు ఎస్సై రవికిరణ్ వివరించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రజలు బయటకు రావొద్దంటూ మైకుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిరంతర నిఘా ఉంచామని ఎస్సై తెలిపారు.