యాక్షన్ కింగ్ అర్జున్ తాను తలపెట్టిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. 15 ఏళ్ల క్రితం తమిళనాడులోని చెన్నైలో ఆంజనేయుడి ఆలయ పనులు మొదలు పెట్టగా, రీసెంట్గా ఆ నిర్మాణం పూర్తైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు అర్జున్. 15 ఏళ్లుగా నేను నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం పూర్తైంది. జూలై 1, 2 తారీఖుల్లో కుంభాభిషేకం జరుపుతున్నాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల అందరి సమక్షంలో ఈ వేడుకను చాలా గ్రాండ్గా చేయాలని అనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎవరిని పిలవలేకపోతున్నాం.అయినప్పటికీ వేడుక ఎవరు మిస్ కావొద్దనే ఉద్దేశంతో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేస్తున్నాని అన్నాడు అర్జున్.