విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు . నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమాతో ప్రశాంత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యాంగ్రీ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఆతర్వాత మరో సరికొత్త జోనర్ లో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు జాంబీల కథతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఇటీవల హను-మాన్ అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఫిక్షనల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయాన్ని తాజాగా ప్రకటించారు. తేజ సజ్జా హీరోగా రూపొందనున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అతి త్వరలోన మూవీ షూటింగ్ జరపనున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.