ములుగు : గిరిజనుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేసిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత చందూలాల్ అత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. చందూలాల్ స్వగ్రామం జిల్లాలోని జగ్గయ్యపేటలోని సారంగపల్లిలో ఆయన పార్థీవదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లను పూర్తి చేయగా.. చందూలాల్ కుమారుడు డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇతర అధికారులు నేతలు అంతిమ సంస్కారాల్లో పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు. మంత్రి సత్యవతి రాథోడ్ కన్నీటి పర్యంతమయ్యారు. గిరిజన నాయకుణ్ణి కోల్పోయామని, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్