కరోనా విలయతాండవం వలన అన్ని రంగాలు స్తంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు కాస్త తగ్గముఖం పడుతుండడంతో అన్ని పనులు మళ్లీ మొదలవుతున్నాయి. ఇక సినిమా రంగం విషయానికి వస్తే కరోనా వలన చాలా చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ అవి మొదలయ్యేందుకు రంగం సిద్ధమైంది.
కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టని క్రమంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ షూటింగ్ సమయంలో ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలో తెలియజేసింది. మాస్క్లు ధరించడంతో పాటు తక్కువ మందితో షూటింగ్ చేయాలని చెప్పిన కౌన్సిల్ తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న యూనిట్ మెంబర్స్ మాత్రమే సెట్లోకి అనుమతించాలని తెలియజేసింది. పూర్తి వివరాలు కింద చూడండి.