టాలీవుడ్లో శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
లాంచింగ్ వేడుకకి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు రాగా, అవి చూసి ప్రేక్షకులు ఆశ్చర్యకపోయారు. తాజాగా వీడియో విడుదల చేశారు. దాదాపు 2 నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. శంకర్.. ఈ సినిమాకు కూడా దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ పోస్టర్ డిజైన్ కోసం ఏకంగా కోటి 73 లక్షలు రూపాయాలు ఖర్చు పెట్టినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
లాంచింగ్ వేడుకకు కోటిన్నర పైగా ఖర్చు చేశారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50వ సినిమాగా, రామ్ చరణ్ 15వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ను పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో అంజలి, సునీల్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.