లెజెండరీ దర్శకుడు టి కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు గోపీచంద్. ఫారెన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన గోపీచంద్.. 2000లో సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలి వలపు సినిమాతో హీరోగా మారాడు. అయితే ఆ సినిమా దారుణంగా బెడిసి కొట్టింది. దాంతో గోపీచంద్ అనే ఓ హీరో వచ్చినట్లు కూడా చాలా మందికి గుర్తు లేదు. రెండేళ్ల వరకు ఈయన మరో సినిమా కూడా చేయలేదు. అలాంటి సమయంలో జయం సినిమాతో విలన్ గా మారాడు. స్టార్ విలన్ అయిపోయాడు.. వెంటనే నిజం, వర్షం లాంటి సినిమాలు కూడా విలన్ గానే నటించాడు. అలాంటి సమయంలో యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర రప్ఫాడించింది. గోపీచంద్ను హీరోగా నిలబెట్టింది. జులై 2, 2004న విడుదలైన యజ్ఞం సినిమాకు 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రం అప్పుడు సాధించిన వసూళ్లను చూద్దాం..
నైజాం: 3.72 కోట్లు
సీడెడ్: 0.81 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.19 కోట్లు
ఈస్ట్: 0.70 కోట్లు
వెస్ట్: 0.50 కోట్లు
గుంటూరు: 0.60 కోట్లు
కృష్ణా: 0.45 కోట్లు
నెల్లూరు: 0.35 కోట్లు
ఏపీ + తెలంగాణ: 8.32 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.61 కోట్లు
వరల్డ్ వైడ్: 8.93 కోట్లు
యజ్ఞం సినిమా విడుదలయ్యే సమయానికి గోపీచంద్ కు హీరోగా ఎలాంటి మార్కెట్ లేదు. దాంతో ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రాలేదు. అందుకే ఈ తరం ఫిల్మ్స్ యజ్ఞం సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు. పబ్లిసిటీ ఖర్చులతో పాటు బడ్జెట్ కూడా కలుపుకుని రూ.5.6 కోట్లు వసూలు చేస్తే యజ్ఞం సేఫ్ జోన్ లోకి వస్తుంది. అలాంటి సమయంలో విడుదలైన ఈ చిత్రం దాదాపు 9 కోట్లు షేర్ వసూలు చేసి గోపీచంద్ కు అదిరిపోయే మార్కెట్ క్రియేట్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో కత్తి మహేశ్ .. చికిత్సకు ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థికసాయం
సునీతపై అసభ్యకరమైన పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సింగర్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
ఆఫర్ల కోసం చూస్తున్న మాధురీదీక్షిత్..!