కరోనా కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. చాపకింద నీరులా థియేటర్ వ్యవస్థను దెబ్బతీస్తూ టాలీవుడ్లోకి ఓటీటీ వచ్చేసింది. ఒకప్పుడు చిన్న సినిమాలే నేరుగా ఓటీటీలో విడుదలైతే.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో థియేటర్లు, ఓటీటీ వ్యవస్థలపై పెద్ద చర్చే జరుగుతుంది. స్టార్ హీరోలు, బడా నిర్మాతలు కూడా ఓటీటీలో తమ సినిమాలు విడుదల చేస్తుండటంతో ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాని నటించిన సినిమాల్లో ఇప్పటికే మొదటి వేవ్లో వీ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయగా.. ఇప్పుడు వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీలో విడుదలవుతుంది. దీంతో ఎగ్జిబిటర్లు.. నానిని టార్గెట్ చేసి మాట్లాడటం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. దీనిపై తనను పరాయివాడిని చేసి మాట్లాడారని నాని కూడా తెగ ఫీలయిపోయాడు. ఇలాంటి సమయంలోనే నాని సినిమా వస్తున్న సెప్టెంబర్ 10న గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీలో నాని సినిమా విడుదల కావడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
సీటీమార్ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న గోపీచంద్ను ఓటీటీలో సినిమాల విడుదలపై మీడియా పలు ప్రశ్నలు అడిగింది. దీనికి గోపీచంద్ కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదల చేయడానికే చేస్తారు. టీవీలో ఓ సినిమాను చూడటానికి.. థియేటర్లలో చూడటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఎలాంటి సినిమా అయినా కూడా థియేటర్ కోసమే చేస్తారని గోపీచంద్ అన్నారు. అలాగని ఓటీటీలో విడుదల చేయడం తప్పు అని అనడం లేదని అంటున్నాడు. మొన్నటి వరకు థియేటర్స్ ఓపెన్ కాలేదు.. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.. ప్రేక్షకులు కూడా వస్తున్నారు. అయినా కూడా కొందరు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ విషయంలో తాను ఒక్కడినే ఎలాంటి కామెంట్ చేయలేను అంటున్నాడు గోపీచంద్. వాళ్ల స్థానంలో కూర్చొని ఆలోచించాలి.. ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు కదా అంటున్నాడు ఈయన.
ఏ సినిమా అయినా కూడా ఆరు నెలల్లో తీసి విడుదల చేయాలని నిర్మాత భావిస్తాడు. ఇలా అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు మనం నిద్ర పోయినా.. తీసుకొచ్చిన వడ్డీలు నిద్రపోవు కదా.. అవి పెరుగుతూనే ఉంటాయి.. అలాంటప్పుడు నిర్మాత తనకు ఏది అనువుగా ఉంటుందో అదే నిర్ణయం తీసుకుంటాడు. అంతే కానీ అయిపోయిన సినిమాను ఇంట్లో పెట్టుకొని కూర్చోలేడు కదా.. వాళ్ల బాధ కూడా అర్థం చేసుకోవాలి.. ఓటీటీ వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పాడు గోపీచంద్. ఏపీలో ఇప్పటికీ 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు అవుతున్నాయి.. అయినా కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి కదా.. ఎన్ని రోజులని ఆపుకొని కూర్చుంటారు అంటున్నాడు ఈయన. మొత్తానికి గోపీచంద్ ఓటీటీ తప్పు అనట్లేదు.. కానీ సినిమా మాత్రం థియేటర్లో చూస్తే మజా అంటున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg boss 5 telugu | ఈ సీజన్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిదో తెలుసా..?
Bigg Boss 5 Sarayu: బిగ్బాస్ స్టేజిపై నాగ్తోనే బూతులు మాట్లాడించిన సరయు ఎలా ఫేమస్ అయింది?
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
RC 15 Poster | కేవలం పోస్టర్ కోసమే శంకర్ కోట్లు ఖర్చు పెట్టించాడా..?
Nayanthara | పెళ్లి తర్వాత నటనపై నయనతార నిర్ణయం