సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్పేట డివిజన్ అంబేద్కర్ నగర్లో రూ.28 కోట్ల వ్య యంతో నిర్మించిన 330 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పురపాలక శాఖ మం త్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 26న ప్రారంభించి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువా రం పీవీ మార్గ్లోని అంబేద్కర్నగర్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వివిధ శాఖల అధికారులతో కలిసి మం త్రి తలసాని పరిశీలించారు. ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్తో పాటు హోం మంత్రి మహమూద్ ఆలీ, హౌసింగ్ శాఖ మం త్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొంటారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని.. ఇది పేదలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. ప్రారంభోత్సవ ఏ ర్పాట్లను ఈ నెల 26లోగా పూర్తి చేయాలని అధికారులనను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఆర్డీఓ వసంతకుమారి, జలమండలి జీఎం రమణారెడ్డి, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, ఎలక్ట్రికల్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం తో గ్రేటర్ పరిధిలోని 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను విడతల వారీగా లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ అందజేస్తున్నది. ఇప్పటికే 12 చోట్ల 2478 ఇండ్లను ప్రారంభించగా, తాజాగా మరో ఆరు చోట్ల 1273 ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముం దు కంటోన్మెంట్ నియోజకవర్గంలో దాదాపు రూ.20కోట్ల వ్యయంతో గాంధీనగర్, సాయిరాం నగర్లో నిర్మించిన 264 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ నగర్ కాలనీలో 330 ఇండ్లను ఈ నెల 26న లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. పొట్టి శ్రీరాంనగర్ 162, సీసీ నగర్ 264, జీవై రెడ్డి 180, ఎస్సీ బోస్ నగర్ 60, చిక్కడపల్లి దోబీఘాట్లో 207 ఇండ్లను సదుపాయాల తో ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.