గోపీచంద్, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. బి.గోపాల్ దర్శకత్వం వహించారు. తాండ్ర రమేష్ నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘లవ్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ఇది. బరువు బాధ్యతలు లేకుండా జీవితాన్ని సరదాగా గడిపే ఓ యువకుడు బెజవాడ రౌడీతో ఎందుకు పోరాటం చేయాల్సివచ్చిందనేది ఈ చిత్ర కథ. గోపీచంద్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలమురుగన్.