స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చి మంచి హిట్ గా నిలిచింది గూఢచారి (Goodachari) . అడివి శేష్ (Adivi Sesh) లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. శోభితా దూళిపాళ్ల, జగపతిబాబు, ప్రకాశ్రాజ్, మధుశాలిని మెయిన్ రోల్స్ లో నటించగా…అక్కినేని సుప్రియ ఈ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించిన గూఢచారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ (Goodachari sequel) రెడీ అవుతోంది. ఆగస్టు 3తో మూడేళ్లు పూర్తి చేసుకుంది గూఢచారి. ఈ సందర్భంగా సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. గూఢచారి తిరిగొస్తున్నాడు..ఈ నెలలోనే ప్రకటన ఉంటుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అడివి శేష్ సీక్వెల్ స్క్రిప్ట్ పనులపై ఫోకస్ పెట్టినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఫస్ట్ పార్టు ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించగా..మరి సీక్వెల్ ను ఎవరు తెరకెక్కిస్తారనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అడివి శేష్ లీడ్ రోల్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్టు మేజర్ షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు అడివి శేష్.