మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవలి కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఇందులో పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే బాటలో కీర్తి నటించిన గుడ్ లక్ సఖి కూడా విడుదల కానున్నట్టు జోరుగా ప్రచారం నడిచింది. తాజాగా దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. గుడ్ లక్ సఖి చిత్రం థియేటర్లోనే విడుదల అవుతుందని, ఓటీటీలో విడుదల కాదని ప్రకటించారు.
స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న గుడ్ లక్ సఖి సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వ వహించారు. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సురేశ్ షూటర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రుతుపవనాల ప్రభావం : శ్రీలంక జలమయం, 14 మంది మృతి
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్