హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): సచివాలయ ఉద్యోగులు, అధికారులంతా గురువారం నుంచి రెగ్యులర్ విధులకు హాజరుకావాలని బుధదవారం సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర మంత్రివర్గం లాక్డౌన్ నిబంధనలను ఉదయం 6నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలించింది. గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరో గంట వెసులుబాటు కల్పించింది. దీంతో సచివాలయంలో పనిచేసే వారు విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీచేశారు. లాక్డౌన్లో 33 శాతం ఉద్యోగులే హాజరయ్యారు. అధికారులు రొటేషన్ పద్ధతిలో కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు.