ఆనంద్కృష్ణ, అశోక్, స్వాతిమండల్, ఇందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జీఎస్టీ’. కొమారి జానకిరామ్ దర్శకుడు. జానయ్యనాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ‘ఫస్ట్ కీ’ని పట్టపగలు వెంకట్రావు విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘దేవుడు, దయ్యం, సైన్స్ లలో ఏది నిజం అనే పాయింట్తో రూపొందిన చిత్రమిది. ఈ అంశానికి సంబంధించి సమాజంలో ఉన్న వాదనలతో పాటు మనుషుల్లో శాస్త్రీయ స్ఫూర్తి లోపించి విజ్ఞానం ఎలా వినాశనానికి దారితీస్తుందో చూపించాం. కథే ఈ సినిమాకు హీరో. ప్రేమ, సెంటిమెంట్, వినోదం, సస్పెన్స్, థ్రిల్తో పాటు అన్ని హంగుల కలబోతగా ఉంటుంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు.