ఘజియాబాద్ : కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. ఓ వైపు వైరస్ వచ్చిన వారికి బతికుండగానే నరకం చూపిస్తుండగా.. మరణించాక సైతం ముప్పు తిప్పలు పెడుతున్నది. పెరుగుతున్న కేసులతో ఓ వైపు బెడ్లు దొరకడం లేదు.. పరిస్థితి విషమించి కొందరు కన్నుమూసినా చివరి ఖర్మలు నిర్వహించేందుకు పడరాని పాట్లు తప్పడం లేదు. పెద్ద ఎత్తున మృతదేహాలు అంత్యక్రియలకు వస్తుండడంతో వసతులు లేక శవాలను వరుసలో పెట్టి, మరికొందరు అంబులెన్సులు, కార్లలో మృతదేహాలను ఉంచి గంటల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని హిండన్ మోక్ష స్థల్ వద్ద హృదయ విదాకరమైన ఘటన చోటు చేసుకుంది. వాటిక వద్ద 42 మృతదేహాలు శుక్రవారం చివరి ఖర్మలకు కోసం నిలిచిపోయాయి. కుటుంబీకులను కోల్పోయి పుట్టెదు దుఃఖంలో ఉన్న వారికి దహన క్రియలకు స్థలం దొరక్కపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శ్మశాన వాటిక పని చేయకపోవడం.. మరో వైపు పెద్ద ఎత్తున మృతదేహాలను వస్తుండడంతో దహన సంస్కారాలకు వినియోగించే కలప ధరలకు రెక్కలు వచ్చాయి.
గురువారం సైతం మోక్ష స్థల్ వద్దకు పెద్ద ఎత్తున మృతదేహాలు రాగా.. దహనం చేసేందుకు రెండు మూడు గంటల సమయం పట్టింది. పలు మృతదేహాలను మరో శ్మశాన వాటికకు పంపగా.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు విద్యుత్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అన్ని ప్లాట్ఫారమ్లు నిండిపోయాయి, అప్పుడు సాల్వేషన్ సైట్ నిర్వహణ టోకెన్లను నిలిపివేసి, కార్యాలయాన్ని మూసివేశారు. గత పది రోజులుగా హిండన్ మోక్ష స్థల్ వద్ద అంత్యక్రియలకు వచ్చే మృతదేహాల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న ఒకే రోజు 35 మృతదేహాలకు దహన క్రియలకు రాగా.. ప్లాట్ఫారాలన్నీ నిండిపోయాయి.