చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్కు సిద్ధమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు షాక్ ఎదురైంది. ఆ జట్టు ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ డానియెల్ సామ్స్కు కరోనా వైరస్ సోకింది. ఆస్ట్రేలియా నుంచి ఈనెల 3న వచ్చిన సమయంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి నెగెటివ్గా రాగా.. బుధవారం జరిపిన టెస్టులో పాజిటివ్గా తేలినట్టు ఫ్రాంచైజీ వెల్లడించింది. సామ్స్కు లక్షణాలు లేవని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. మరోవైపు బెంగళూరు యువ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్.. కరోనా నుంచి కోలుకొని జట్టుతో కలిశాడు. కాగా ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేతో పాటు వాంఖడే స్టేడియంలో 13 మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.